సాక్షి చేస్తోంది కూడా అదేగా..!


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపైన, ఆయన మీడియా సంస్థలపై విమర్శలు కురిపిస్తున్నారు. కారు స్పీడ్ ఎక్కువైతే ప్రమాదాలు జరిగి పరలోకాలకు వెళ్లవలసి వస్తుందని హెచ్చరించారు. కారు స్పీడ్ ఎక్కువైతే ప్రమాదం అన్నంత వరకు ఫర్వాలేదు కాని పరలోకాలకు వెళతారని ముఖ్య మంత్రి అనడం అంత సమంజసంగా ఉండదు. ప్రత్యర్ధి వై.ఎస్.జగన్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకునే అవకాశం ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా ఫర్వాలేదు కాని పోతావు అని హెచ్చరించినట్లుగా చేయడం సెంటిమెంటుకు వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఇక జగన్ మీడియాపై కూడా గుంటూరుజిల్లా పర్యటనలో కిరణ్ విమర్శలు చేశారు.రెండువేల ఎనిమిదిలో సాక్షి పత్రిక, ఛానల్ పెట్టడానికి ముందు రెండు పత్రికలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడానికే సాక్షిని ప్రారంభిస్తున్నామని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, సాక్షి కూడా ఇప్పుడు అదే ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తోందని వ్యాఖ్యానించారు. రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేమనడానికి ఇది కూడా ఒక ఉదాహరణే. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డికి ఈనాడు పత్రికకు ఉప్పు,నిప్పుగా ఉండేది.అలాంటి ఇప్పుడు జగన్ మీడియా ఆయనకు దూరం అయితే ఈనాడు, ఇతర పత్రికలు సన్నిహితంగా ఉంటున్నాయి. అదే రాజకీయ వైచిత్రి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!