కేసీఆర్ కామెంట్‌పై గ‌రం..గ‌రం..


తెలంగాణ రాకపోతే విషం తాగడమే నయమన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. జూలై పద్నాలుగో తేదీన రెండువారాలలో తెలంగాణ వస్తుందన్న కెసిఆర్ ఇప్పుడు తెలంగాణ రాకపోతే విషం తాగడమే నయమని అనడంలో అర్దం ఏమిటని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు దీనిని ఒక జోక్ గా కొట్టిపారేశారు. ఆ పార్టీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణవాదులను ఆత్మహత్య లకు కెసిఆర్ పురికొల్పుతున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అన్నారు. కాగా తాము ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నా కార్యక్ర మానికి ఆటంకం కలిగించేందుకు కెసిఆర్ రాస్తరకోల ఆందోళనకు పిలుపు ఇచ్చారని వెంకట వీరయ్య వ్యాఖ్యానిం చారు. వీరయ్య వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్న కెసిఆర్ అంతటి పెద్ద నాయకుడు విషం తాగడం నయమని వ్యాఖ్యానించడం సరైన విషయంగా కనిపించదు. ఉద్యమాన్ని ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు రెండువారాలో వస్తుందనో , ఫలానా తేదీకి వస్తుందనో చెబుతూ ఇప్పుడు తెలంగాణ రాదన్న సంకేతం ఇచ్చే విధంగా విషం తాగడం నయమని అనడం మాత్రం ఆయన స్థాయికి తగినట్లుగా లేదు. తెలంగాణ సమాజాన్ని పురోగతిలో నడిపించవలసిన సమయంలో ఇలా ఆత్మన్యూనత భావానికి గురి చేయడం, అమాయకులను ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా మాట్లాడడం ఏ మాత్రం సబబు అనిపించదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!