సూక్ష్మశరీరంలో ఎన్ని భాగాలు...(మరణరహస్యం -పార్ట్ 4)

   స్థూల శరీరం ఉన్నట్టుగానే, సూక్ష్మ శరీరం ఉంటుందా...? అసలు సూక్ష్మ శరీర భాగాలను ఎన్ని  రకాలుగా గుర్తించవచ్చు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
  మానవుని శరీరాన్ని సూత్రబద్ధంగా విభజించినప్పుడు 24 భాగాలుగా ఉంటుందని అంటారు. జీవుడినీ, ఆత్మను కలుపుకుంటే ఈ సంఖ్య 26 అవుతుంది. అయితే, వీటిలో పది మాత్రమే భౌతికంగా కనబడుతుంటాయి. కనిపించని స్థితిలో 15 ఉంటాయి. పైకి కనిపించే వాటిని స్థూల శరీర భాగాలనీ, అలాగే, కనిపించని వాటినిసూక్ష్మ శీరీరాలను పిలుస్తుంటారు.
స్థూల శరీర భాగాలు

  1. కన్ను
  2. ముక్కు
  3. నాలుక
  4. చెవి
  5. చర్మం
  6. చేతులు
  7. కాళ్లు
  8. నోరు
  9. గుదము
  10. గుహ్యము

సూక్ష్మ శరీర భాగాలు ఇవి...
  1.  జీవుడు
  2.  మనస్సు
  3.  బుద్ధి
  4. చిత్తము
  5.  అహము
  6.  చూపు
  7.  వినికిడి
  8.  స్పర్శ
  9. రుచి
  10. వాసన
  11. వ్యాన వాయువు
  12. సమాన వాయువు
  13. ఉదాన వాయువు
  14. ప్రాణ వాయువు
  15. అపాన వాయువు

ఈ 25 భాగాల శరీరాన్ని నడిపించేదే ఆత్మ అని అంటుంటారు. కాలమరణంలో స్థూల, సూక్ష్మ శరీర భాగాలైన 25 భాగాలను వదిలేసి జీవుడు, ఆత్మ వెళ్లిపోతారు. కానీ, అకాల మరణంలో జీవుడు ఆత్మ వదిలేసి వెళ్ళిపోరు. అక్కడే సూక్ష్మ శరీరంతో ఉంటారు. శ్వాసపీల్చడం లేదు కనుక మరణం సంభవించినట్టు అందరూ భావించవచ్చు. కానీ నిజానికి ఇది పూర్తి మరణం కాదన్న సిద్ధాంతం ఒకటి ఉంది. బహుశా, అందుకేనేమో...మనవాళ్లు `దింపుడుకళ్లెం. ఆశతో అంత్యక్రియలకు ముందు సమీపబంధువులతో మృతిచెందాడని భావించే వ్యక్తిని తట్టిలేపుతుంటారు.
 తాత్కాలిక మరణస్థితి గురించిన ప్రస్తావన భగవద్గీతలో కూడా ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన బ్రహ్మయోగ స్థితి ఇంచుమించు తాత్కాలిక మరణంలాంటిదేనా...?
 బ్రహ్మయోగంలో చెప్పిన విషయాలు
 బాహ్యజ్ఞానేంద్రియాలు పనిచేయకపోవడం
శ్వాస స్థంభించిపోవడం
గుండె ఆగిపోవడం
 పైకి చూడటానికీ, బ్రహ్మయోగం, తాత్కాలిక మరణ స్థితి ఒకేమోస్తరుగా ఉన్నప్పటికీ, లోపల జీవుడు మాత్రం రెండు విభన్న స్థితుల్లో ఉంటాడని సిద్దాంతాలు చెబుతున్నాయి. తాత్కాలిక మరణంలో జీవుడు మరుపుతో ఉంటాడు. కానీ, అదే బ్రహ్మయోగంలో జీవునికి అంతా తెలుస్తూనే ఉంటుంది. ఈ రెండు స్థితుల్లోనూ జీవుడు తిరిగి ప్రాణములతో లేవగలిగినవాడేనని సిద్ధాంతీకరిస్తున్నారు.
 తాత్కాలిక మరణం కేవలం మనుషులకే పరిమితం కావడంలేదు. మిగతా జీవుల్లోనూ ఇలాంటి మరణం సంభవిస్తున్నదని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. కప్పలు, కీటకాలు వంటి జంతువులు తాత్కాలిక మరణం పొంది, ఆ తరువాత కొన్నాళ్లు, లేదా కొన్నేళ్లకు మళ్ళీ చేతనావస్థకు చేరుకుంటున్నాయని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది.
 మరణం అనివార్యమని అందరికీ తెలుసు. తాత్కాలిక మరణం గురించి తెలుసుకోవడం ద్వారా, ఆ ప్రక్రియను ఆచరించడంద్వారా ఆయుష్సు పెంచుకోవచ్చన్న కొత్త వాదన కూడా పుట్టుకొచ్చింది. శ్వాసను కొంతకాలం నియంత్రించడంతో ఆయుఃప్రమాణం పెరుగుతుందన్న సిద్ధాంతం బలోపేతమవుతోంది. ఈ కారణంగానే పూర్వం మనుషులు వేలాది సంవత్సరాలు జీవించిఉన్నారని చెబుతున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా, మరణరహస్యం చేధిస్తే మరిన్ని అద్భుతాలు ఆవిష్కృతమవడం ఖాయం.
- తుర్లపాటి నాగభూషణరావు
     9885292208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!