జగన్ సోనియా కాలి గోటికి సరిపోడు....ఇలా అన్నది ఎవరు?

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కడప ఉపె ఎన్నికను ఎ.ఐ.సి.సి. అధ్యక్షురాలు సోనియాగాంధీకి, వై.ఎస్.రాజశేఖరరెడ్డికి మద్య పోటీగా అభివర్ణించడం కాంగ్రెస్ నేతలుకు ఏ మాత్రం జీర్ణం అవడం లేదు. అందులోను బలవంతంగా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేయాల్సి వచ్చిన మంత్రి డి.ఎల్.రవీంద్ర రెడ్డికి ఈ నినాదం చిర్రెత్తిస్తోంది.అసలే ఘాటైన విమర్శలు చేసే డి.ఎల్ కు ఈ అంశం మరింత కోపం తెప్పిస్తోంది. దాంతో ఆయన జగన్ పై తన దాడిని మరింతగా పెంచారు.ఏకంగా ఈసారి సోనియాగాంధీ కాలిగోటికి కూడా వై.ఎస్.జగన్ సరిపోడని ప్రకటించారు. ఆయా ఎన్నికల సభలలో ఆయన ఈ విమర్శల దాడి చేశారు.ఇటలీ కాంగ్రెస్ అని విమర్శిస్తున్న జగన్ రెండువేల తొమ్మిదిలోజరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఎలా పోటీచేశారని ప్రశ్నించారు.ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా జగన్ స్పందించడం లేదని రవీంద్ర రెడ్డి ఆరోపించారు. ఎన్నికలలో ధన ప్రవాహం విచ్చలవిడిగా సాగుతోందని అంటూ జగన్ తన వర్గం చోటా నేతలకు గాను 81 స్పార్కియో వాహనాలను కొనుగోలు చేశారని,తన నియోజకవర్గం లోని ఖాజీపేటలో కూడా ఇద్దరికి ఈ వాహనాలు అందాయని ఆయన వెల్లడించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!