అరుణాచల్ ప్రదేశ్ సీఎం డోర్జీ హెలికాప్టర్ మిస్సింగ్

  ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ అదృశ్యమైన సంఘటన జరిగి సుమారు రెండేళ్లు కాబోతున్న తరుణంలో ఇప్పుడు హఠాత్తుగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు ఎక్కిన హెలికాప్టర్ శనివారం (30-04-11) ఉదయం పదిగంటల ప్రాంతంలో అదృశ్యమైంది. దాని జాడ కనుగొనేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 2007 ఏప్రిల్ 9న డోర్జీ ఖండు ఆరవ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో జిగాంగ్ అపాంగ్ శకం ముగిసింది. ఆ తరువాత 2009 అక్టోబర్ 25న తిరిగి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన మొనపా గిరిజన తెగకు చెందిన వ్యక్తి. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డోర్జీ ఖండు 1955 మార్చి 3న గ్యాంగ్ ఖార్ గ్రామంలో జన్మించారు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!