ఆంధ్రజ్యోతిపై సాయిట్రస్టు కన్నెర్ర... దావాకు సిద్ధం?

సత్యసాయి ట్రస్టుకు వ్యతిరేకంగా ఒక దినపత్రిక పనికట్టుకుని కదనాలు రాసిందని, అవన్ని ఆదార రహితమైన కధనాలని , ఆ పత్రికపై తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు ప్రకటించారు.పుట్టపర్తిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయం తెలిపారు.ఇప్పటికే ఆ పత్రికకు నోటీసులు జారీ
చేశామని, సమాదానం వచ్చిన వెంటనే చట్టపరంగా పరువు నష్టం దావా వేస్తామని వారు తెలిపారు. ట్రస్టు పరువు తీసే విధంగా అనేక కధనాలు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సత్యసాయికి సంబందించిన పలు సంచలన కధనాలను ఆంద్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది.వారు పేరు ప్రకటించకపోయినప్పటికీ, ఆ పత్రికపైనే దావా వేస్తున్నరని అంటున్నారు.సత్యసాయిబాబానే ఛైర్మన్ గా కొనసాగుతారని, ఆయన పేరుతో బ్యాంకు ఖాతా కూడ లేదని ఆయన అన్నారు.కాగా చెక్ పవర్ ఎవరికి ఉండాలన్నదానిపై ఇంకా
నిర్ణయం తీసుకోలేదన్నారు. సత్యజిత్ తో తనకెలాంటి విబేధాలు లేవని రత్నాకర్ తెలిపారు. ట్రస్టు సారధి ఎవరన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
-kommineni.inf

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!