ఇంట్లో నక్కను పెంచుతున్న హరికృష్ణ



సినీరంగంలోని వారికి, రాజకీయరంగంలోనివారికి నమ్మకాలు భలే తమాషాగా ఉంటాయి. రాష్ట్ర రాజకీయాలలో ఒక విప్లవాన్ని తీసుకువచ్చిన తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు కుమారుడు,రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ ఈ మధ్య ఒక నక్కను పెంచుతున్నారు. కొద్దికాలంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో వివాదపడుతున్న హరికృష్ణ రాజకీయంగా తనకేదో నష్టం జరిగిందని భావిస్తున్నారు. కృష్ణాజిల్లాలోతన అనుచరులైన కొడాలి నాని, వంశిమోహన్ లకు మద్దతు ఇచ్చిన నేపధ్యంలో ఆయనతో మాట్లాడదామని హరికృష్ణ ఇంటికి వెళ్లిన మీడియా వారికి అక్కడ ఒక నక్కను చూసి ఆశ్చర్యపోయారు. ఇదేమిటి నక్క ఉంది అని అడిగితే హరికృష్ణ సెంటిమెంటుగా నక్కను పెంచుతున్నారని చెప్పారట. నక్కను తొక్కి వచ్చావు అదృష్టం కలిసి వచ్చిందనేది ఒక నానుడి. దానిని దృష్టిలో ఉంచుకుని హరికృష్ణ ఈ విధంగా చేస్తున్నారేమోనని కొందరు భావిస్తున్నారు. ఇదేకాదు.కొన్నేళ్ల క్రితం ఒకసారి తన అనుచరులు కొందరికి ఒక పని పురమాయించారట. అదేమిటంటే ఒక జ్యోతిష్కుడెవరో ఆయనకు చెప్పారట.
పులిమీసాలు కనుక తాయత్తులో పెట్టి చేతికి కట్టుకుంటే మంచిదని. అంతే. ఆయన పులిమీసాల కోసం అనుచరులకు పురమాయించారు.దాంతో వారి చావుకు వచ్చిందట. అక్కడక్కడ తిరిగి చివరికి జూ కు వెళ్లి వాకబ్ చేశారట.వారు ఆశ్యర్యపోయి అదెలా సాధ్యం అవుతుందన్నారట. దాంతో ఏమి చేయాలో తోచక తిరిగి వచ్చేశారు. ఇదీ హరికృష్ణ సెంటిమెంటు వ్యవహారం.
Source; kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!