బాబా ఆస్తులకు మార్కెట్ విలువ కట్టలేమా!?

సత్యసాయి ట్రస్టు ఆస్తుల విలువెంత అన్నదానిపై కచ్చితమైన అంచనా వేయడానికి సత్యసాయిఇ ట్రస్టు సభ్యులు నిరాకరించారు. సత్యసాయి ట్రస్టు సభ్యులు శ్రీనివాసన్, భగవతి, రత్నాకర్, ఇందులాల్ షా ప్రభృతులు ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆస్తులు,తదితర వివరాలు,వాటికి ఏ అవసరాలకు వాడుతున్నది వివరంగా ప్రకటన రూపంలో ఇచ్చామని వారు తెలిపారు. అయితే వాటికి విలువ ఎంతన్నది అసందర్భమని,వాటిని వాణిజ్య అవసరాలకు వాడడం లేదని,అందువల్ల మార్కెట్ విలువను లెక్కగట్టజాలమని సభ్యులు తెలిపారు
అయితే బాబా శవపేటికకు తాము ఆర్డర్ ఇవ్వలేదని, ఒక భక్తుడు పంపించారని వారు తెలిపారు.ట్రస్టు సభ్యులలో ఎలాంటి విబేధాలు లేవని శ్రీనివాసన్ తెలిపారు.విరాళాల కోసం, నిదుల కోసం ఎప్పుడూ విజ్ఞప్తులు చేయలేదని, ఎవరికి వారు ఇచ్చేవారని, కోట్ల రూపాయల విలువైన బంగారం తరలిపోయిందని మీడయాలో వచ్చిన కదనాలు అవాస్తవమని వారు తెలిపారు.కొంతమంది కావాలని బురదచల్లారని విమర్శించారు.సత్యజిత్ ను బాబా వ్యక్తిగత సహాయకుడిగా ఎంచుకున్నారని, అంతకుమించి ప్రత్యేక హోదా ఏమీ లేదని వారు చెప్పారు.బాబా ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులంతా దర్శించుకున్నారని అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!