బాబా స‌మాధిలో విచిత్ర మూలిక‌లు

కొందరు ఋషులు, మహా పురుషులు  బ్రతికుండగానే సమాధి అయ్యారని విన్నాము. బ్రతికుండగానే  శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మహా సమాధి అయ్యారు. సమాధి అయ్యాక వంద సంవత్సారాల తరువాత తీసి చూసినా వారి శరీరము ఏ మాత్రము కుళ్ళిపోకుండా తేజస్సుతో వెలిగిపోతుంటుంది. దీనికి కారణం ఏమిటి… శరీరాన్ని మట్టిలో పాతివేసాక ఆ శరీరం కుళ్ళిపోకుండా ఎలా  ఉండగలుగుతుంది.. దీని వెనుక కారణం ఏమిటి.. ఈ ప్రశ్నలకి సమాధానం కనుగొనడానికి 17 వ శతాబ్దం లోనే శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. వారు కనుగొన్న రహస్యం ఏమిటంటే ఋషులు తాము మహా సమాధి అవడానికి ముందుగా గొయ్యిలో బస్తాల కొద్ది ఉప్పుని పోస్తారు. ఉప్పు శరీరం కుళ్ళిపోకుండా కాపాడుతుంది కాబట్టి అలా చేస్తారు. ఆ తరువాత లవంగము, యాలకులు, కస్తూరి, కుంకుమపువ్వు తదితర మొక్కలని, మరికొన్ని ములికలని వేస్తారు. ఈ మొక్కలు, మూలికలు గొయ్యిలోకి బ్యాక్టీరియాలు చేరకుండా కాపాడుతాయి. ఆ కారణం చేతనే వందలు, వేల సంవత్సరాలు అయినా కుడా సమాధి అయినవారి శరీరం ఏమాత్రం చెక్కు చెదరకుండా వుంటుంది. సాయి బాబా సమాధి లో కుడా కొన్ని విచిత్ర మూలికలు వేసారని, ఆయన శరీరం కూడా ఎన్ని సంవత్సరాలయినా తేజస్సుతో వెలిగిపోతుందని అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!