జగన్ పై రామోజీ ప్రత్యక్ష యుద్ధం


ఎన్నికల ఘట్టం ఆరంభమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నామినేషన్  వేయడంతో ఈనాడు నేరుగా యుద్ధానికి సిద్ధమవుతుంది. జగన తన ఆస్తులను 365కోట్ల రుపాయలుగా ప్రకటించడంతో దానిపై ఈనాడు ప్రత్యక్షంగా దోచిందెంతో దాచారు అని బ్యానర్ శీర్షికను ఇచ్చి విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది. అందులో ఆయన అనేక ఆస్తులను
ప్రస్తావించలేదని,హైదరాబాద్,బెంగుళూరుల్లో ఉన్న రాజభవనాల ఊసే లేదని ఈనాడు  పేర్కొంది. కాగితపు లెక్కల ప్రకారం చూసినా రెండేళ్లలో ఆయన ఆస్తులు ఆరురెట్లు పెరిగాయని పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన అంశమేమిటంటే రాజకీయపార్టీలు విమర్శ చేసిన మాదిరిగా ఈనాడు దినపత్రిక కూడా దోచిందెంతో దాచారు అని వ్యాఖ్యానించింది.గతంలో రామోజీని మార్గదర్శి కేసులోనూ,
ఇతరత్రా కేసుల్లోనూ ఇరకించారని, దానికి ప్రతికారంగా ఇప్పుడు రామోజీరావు తన అక్కసును జగన్‌పై తీర్చుకోవడానికి ఇలా రాశారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!