శ్రీకాళహస్తికి ధోనీ సేన


ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా సభ్యులు శ్రీకాళహస్తికి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ ముందురోజు వచ్చిన భారతజట్టు చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఇక్కడ శివుణ్ని కోరుకుంటూ భారతజట్టు ప్రపంచకప్ గెలిస్తే టీమిండియా క్రికెటర్లంతా వస్తామని మొక్కుకున్నారు. అనుకున్నట్లుగా ప్రపంచవిజేతగా ఇండియా నిలవడంతో దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం దక్షిణాదికాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తికి జట్టు సభ్యులను తీసుకువచ్చేందుకు ఆటగాళ్లకు శ్రీకాంత్ సమాచారం అందవేశారు. దాంతో ఈనెల 9న టీమిండియా సభ్యులు శ్రీకాళహస్తికి వచ్చే అవకాశాలున్నట్లు ఆలయ అధికారులకు,పూజారులకు సమాచారం అందినట్లు తెలుస్తుంది. మొదటినుంచి శ్రీకాళహస్తికి శ్రీకాంత్,కపిల్‌దేవ్ లతో పాటు చాలామంది క్రీడాకారులు దర్శించుకుంటుంటారు. ఇక్కడ వివిధ రకాలైన దోషాలు తీయడం, ప్రత్యేకపూజలు చేయడం వల్ల భక్తులకు మేలు జరుగుతుందనేది నమ్మకం. అందులోనే టీమిండియా సభ్యులు కూడా వస్తున్నట్లు సమాచారం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!