చిరంజీవి కుమార్తే వేధిస్తోంది


ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, ఆయన కుమార్తె శ్రీజ తమను వేధిస్తున్నారని శ్రీజ అత్త సూర్య మంగళ ఆరోపిస్తున్నారు. చిరంజీవి కూతురు శ్రీజ కొంతకాలం క్రితం శిరీష్‌ భరద్వాజ అనే అతనిని ప్రేమించడం, తదుపరి అతనితో విబేదాలు రావడం, ఆ పై తనను శీరీష్ తల్లి సూర్య మంగళ వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడం తెలిసిన సంగతే. దానిపై శిరీష్, సూర్య మంగళల బెయిల్ పిటిషన్ కు దరఖాస్తు చేసుకోగా, దానిని అనమతించరాదని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది వాదించారు. ఆ పై శిరీష్ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేస్తూ, శ్రీజ తల్లిదండ్రులు పలుకుబడి కలిగినవారని, అదే సమయంలో శిరీష్ తల్లిదండ్రులకు పలుకుబడి లేదని పేర్కొన్నారు.శ్రీజ, ఆమె తల్లిదండ్రులు అంటే చిరంజీవి వైపు నుంచి విపరీతమైన మానసిక వేధింపు ఎదురు కావడంతో సూర్య మంగళ ఆర్టీసి ఉద్యోగం నుంచి స్వచ్చంద పదవీ విరమణ చేశారని న్యాయవాది వివరించారు.అయితే ప్రాసిక్యూషన్ న్యాయవాది మాత్రం బెయిల్ షరతులు భర్తీ చేయనందునే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.కాగా భరద్వాజ తరపు న్యాయవాది మరో విషయం చెబుతున్నారు. ఈ నెల 30వ తేదీన శ్రీజ,శిరీష్ ల జంటకు కౌన్సెలింగ్ ఉంటుందని, , ఆనాటికి ఈ సమస్య ఒక కొలిక్కి రావచ్చని ఆయన అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!