అక్బరుద్దీన్ ఒవైసీపై కాల్పులు, కత్తిపోట్లు


హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై శనివారం (30-04-11) ఉదయం 11-15 గంటల ప్రాంతంలో దాడి జరిగింది. కొంతమంది వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. కత్తితో కూడా దాడి జరిపారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రాధమిక విచారణలో తేలింది. మహ్మద్ పహిల్వాన్ విరుచుకుపడినట్టు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన అక్బరుద్దీన్ ఒవైసీని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బార్కాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
 ఈ సంఘటనతో ఓల్డ్ సిటీలో హైఅలెర్ట్ ప్రకటించారు. అక్కడ 20వేల మంది పోలీసులను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా దుకాణాలను మూయించారు.

 అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్. అక్బరుద్దీన్, ఆల్ ఇండియా మజ్లీస్ ఈ ఇతెహదుల్లాముస్లిమీన్ - ఎఐఎంఐఎం- వ్యవస్థాపకులు సుల్దాన్ సలాలుద్దీన్ కుమారులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నివాసముంటున్న అక్బరుద్దీన్ ప్రస్తుతం చాంద్రాయణగుట్ట స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 1971 జూన్ 14న జన్మించారు. వైద్యవిద్య (ఎంబీబీఎస్)ను మధ్యలో ఆపేసి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. ఆయన భార్యపేరు సబీనా ఫర్జా. వీరికి ఇద్దరు పిల్లలు. అక్బరుద్దీన్ ఒవైసీ పుస్తక ప్రియులు. వ్యాసాలు రాయడం అంటే ఇష్టం. ప్రపంచ చరిత్ర మరీ ముఖ్యంగా ఇస్లామిక్ చరిత్రను చదవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. బాస్కెట్ బాల్, బిలియర్డ్స్ స్విమ్మింగ్ అంటే ఇష్టం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!