సాయిది సహజ మరణం కాదా..!!

పుట్టపర్తి సత్యసాయిబాబాది సహజ మరణం కాదంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై స్పందన ఎలా ఉంటుందన్నది పక్కనబెడితే ఎందుకు ఈ ఫిర్యాదులు చేస్తున్నారు? ఈ ఫిర్యాదులలో ఏముందన్నది తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.సమాచార హక్కు ఉద్యమ సంఘానికి రాష్ట్ర అద్యక్షుడిగా ఉంటున్న గంగాధర్ ఈ ఫిర్యాదు చేయడం విశేషం.సత్యసాయి బాబా మరణం సహజమైనదికాదని చెబుతూ గంగాదర్ హైకోర్టు, మానవ హక్కుల కమిషన్, డిజిపి, అనంతపురం ఎస్.పి, పుట్టపర్తి పోలీస్ స్టేషన్ లకు తన ఫిర్యాదు లేఖలను పంపించారు.ఈ విషయాన్ని వెల్లడిస్తూ, అందులో రాసిన వివరాలను తెలియచేశారు.
బాబాకు వచ్చిన వ్యాధులకు సంబంధించి సరైన చికిత్స జరగలేదని, దీనిపై అనేక అనుమానాలు వస్తున్నాయని ఆయన అన్నారు.బాబాకు మందులను ఓవర్ డోస్ ఇచ్చారని, అలాగే అనవసర మందులు ఇచ్చారని అనుమానాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గంగాధర్ తన లేఖలో కోరారు.గంగాదర్ వద్ద దీనికి సంబంధించిన ఆధారాలు ఏమీ ఉన్నట్లు లేవు. కేవలం పత్రికల కధనం ఆధారంగానే ఆయన ఈ లేఖ చేసినట్లున్నారు. ఇలాంటి సందర్భాలలో ఈ ఫిర్యాదులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!