అన్నా హజారే ఆత్మహత్యాయత్నం!


కొన్ని వినడానికే ఆశ్చర్యంగా ఉంటే ఉండవచ్చు. కానీ ఇది నిజమే.  అవినీతికి వ్యతిరేకంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో నాలుగు రోజులపాటు నిరాహార దీక్ష చేసి ఆసేతుహిమాచలాన్ని కదలించిన ప్రఖ్యాత సంఘ సేవకుడు అన్నా హజారే కూడా గతంలో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన చేశారన్నది పచ్చి నిజం. 
  మహారాష్ట్రలోని సొంత గ్రామం రాలేగావ్ సిద్దిని దేశంలోనే అత్యంత ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దిన అన్నాహజారేకి ఇలాంటి ఆలోచన రావడం ఏమిటా అన్న భావన కలుగుతుంది. కాని ఇది నిజమే.స్వయంగా అన్నా హజారేనే ఈ విషయం వెల్లడించారు. 1962లో ఇండియా, చైనాల మధ్య యుద్దం జరిగింది.ఆ తర్వాత యువత రక్షణదళాలలో చేరాలని కేంద్రం పిలుపు ఇచ్చింది. దానికి అనుగుణంగా హజారే మిలటరీలో చేరారు.1965లో ఇండియా,పాక్ ల మధ్య యుద్దం వచ్చింది.ఆ యుద్ద సమయంలో అన్నా హజారేని దేశ సరిహద్దులోని ఖెమెరన్ ప్రాంతంలో నియమించారు. అక్కడ యుద్దం జరుగుతున్నప్పుడు అన్నా హజారే సహచరులు పందొమ్మిది మంది చనిపోయారు. హజారే తలకి గాయం అయిందికాని బతికి బయటపడ్డారు. అక్కడ సహచరుల శవాలు చూసి ఆయన మనసు కకావికలమైంది. ఆ దశలో ఆయనకు ఆత్మహత్య ఆలోచన వచ్చింది.కాని అప్పుడు వివేకానందుడు రచించిన ఒక పుస్తకం చదవడంతో జీవితంపై ఆయన అవగాహన మారిపోయింది. జీవితంలోని అర్ధం, పరమార్ధం ఏమిటో తెలుసుకున్నానని, ఆ తర్వాత దానిని అమలు చేయడం ఆరంభించానని హజారే వెల్లడించారు.దాంతో ఆయన ఆత్మహత్య ఆలోచనను మానుకుని సమాజసేవారంగంలోకి దుమికారు.ఒక్కొక్కసారి ఒక్కో ఘటన కొందరి జీవితాలను మార్చివేస్తుంది.అలాగే అన్నా హజారే జీవితంలో కూడా ఇది కీలకమైన ఘట్టం.
- Source: kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!