చిరంజీవికి సప్లమెంటరీ ఎగ్జామ్స్‌


|
కాంగ్రెస్‌లో విలీనం చేసిన ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి తమిళనాడులో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అక్కడ డిఎంకె-కాంగ్రెస్‌ల కూటమిని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ చిరంజీవిని కోరడంతో అక్కడ కట్టుబాట్లకు అనుకూలంగా తెల్లని పంచెను లుంగీ మాదిరిగా కట్టుకుంటూ తమిళనాడులోని తెలుగువారు ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు పీఆర్పీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయన వేషభాషలు కూడా మారబోతున్నాయి. అయితే చెన్నైలో చాలాకాలం నివశించిన చిరంజీవికి తమిళంపై కూడా అవగాహన ఉంటుంది. అంతేకాక ఆయన సినిమాలు అనేకం తమిళంలో బాగా ఆడాయి. ఒకరకంగా చెప్పాలంటే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆయనకు లభించే ఆదరణ, భావవ్యక్తీకరణ ప్రజలను ఆకట్టుకునే తీరును పరిశీలించి కాంగ్రెస్ అధిష్టానం మిగతా రాష్ట్రాల్లో వినియోగించుకోవడానికి, చిరును కాంగ్రెస్ హైకమాండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ విధంగా చూస్తే ఆంధ్రాలో విఫలమైన చిరంజీవికి తమిళనాడు ఎన్నికలు సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌గా కొందరు అభివర్ణిస్తున్నారు. తమిళనాడు ప్రచారం అయినతర్వాత కడప జిల్లాలో కూడా చిరంజీవి ప్రచారం జరగబోతుంది.
-కొమ్మినేని (kommineni.info)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!