ఉపఎన్నికల్లో జగన్ మెజారిటీ ఎంత?


కడప, పులివెందుల ఉపఎన్నికల్లో జగన్, విజయమ్మల మెజారిటీ ఎంత అనేదానిపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. గతంలో వచ్చిన మెజారిటీ ఈసారి రాదని కొంతమంది అంటుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈసారి జగన్ కు మూడులక్షలు,విజయమ్మకు యాభైవేలు మెజారిటీ వస్తుందని చెప్తున్నారు. పులివెందులలో బాబాయ్ కి, కడపలో అబ్బాయికి ఓటేద్దామని పులివెందుల ఓటర్లు చెప్తున్నారని ప్రచారం జరుగుతుంటే,ఈసారి జగన్, విజయమ్మలకు ఓటేద్దామని, మరోసారి చూసుకుందామని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రచారానికి వెళ్తున్న నేతలు వద్ద చెప్తున్నారని మరో రకమైన వినికిడి.అయితే ఈ మధ్యాహ్నం కడప లోక్ సభ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డిలు మాత్రం మరో రకమైన సవాల్ జగన్ వర్గానికి చేశారు. జగన్ కు మెజారిటీ రెండులక్షలు వస్తే మా ఆస్తులు రాసిస్తామని సవాల్ చేశారు. మరి వీరి సవాల్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

కామెంట్‌లు

  1. మెజారిటీ డి.ఎల్.,మరియు వీరశివారెడ్డి లు చెప్పేసారుగా,రెండు లక్షలు వస్తాయని.వాళ్ళు మానసికంగా జగన్ గెలుపు ఖాయమని సిద్దపడి మెజారిటీ కూడా చూచాయిగా చెప్పేసారు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!