వాస్తుదోషంతోనే సత్యసాయి బాబా మరణం?

నడిచేదేవుడు సత్యసాయికి చికిత్స చేసిన గది వాస్తు దోషంతో ఉన్నదా..? అందుకే బాబావారు ఆరోగ్యం నుంచి కోలుకోలేకపోయారా...?? ఈ కారణంగానే బాబావారు బౌతికంగా భక్తులకు దూరమైపోయారా..?? ఇప్పుడు పుట్టపర్తిలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.
భగవాన్ సత్య సాయి బాబా తన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కోట్లాది భక్తులు శోక సముద్రంలో మునిగిపోయారు, సామాన్య మనుషుల నుండి, విఐపి ల వరకూ సాయి మరణానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే తానూ 96 సంవత్సరాలు బ్రతుకుతానని స్వయంగా సత్య సాయి బాబా తన భక్తులకు చెప్పారు. కాని అనూహ్యంగా పది సంవత్సారాలు ముందుగానే ఆయన తన దేహాన్ని విడిచిపెట్టారు. సాయి మాటలని నమ్మే భక్తులు తన మరణం విషయంలో సాయి మాటలు ఎలా లెక్కతప్పాయని తీవ్రంగా కలత చెందుతున్నారు. సాయి ఆకస్మిక మరణానికి కారణం ఏమిటో తెలుసుకోవాలన్న అన్వేషణలో పడిపోయారు.. ఈ అన్వేషణలో వారికి దొరికిన జవాబు, సాయి ఆకస్మిక మరణానికి కారణం ఏమిటో తెలిసిందిట.. ఆ కారణం ఏమిటంటే సాయి కి ట్రీట్ మెంట్ చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోని గదిలో వాస్తు దోషాలు వున్నాయని, ఆ వాస్తు దోషం వల్లే సాయి మృత్యువుకు చేరువయ్యారని అనుకుంటున్నారు.. దీనిలో నిజమెంతో తెలియదు. ఏది ఏమైనప్పటికీ సత్య సాయి మరణము ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటన్నది కాదనలేని సత్యం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!