సత్యసాయి సజీవ సమాధిపై వదంతులు



పుట్టపర్తి సాయిబాబ ఆరోగ్యంపై ఒకసక్క రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తుంటే , తాజాగా మరికొన్ని వదంతులు కూడా చెలరేగుతున్నాయి.ముఖ్యంగా సాయిబాబాను ఆయన అభిమతం మేరకు సజీవ సమాధి చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కొన్ని పత్రికలలో దీనిపై కధనాలు కూడా వచ్చాయి. భక్తులకు సాయిబాబా దర్శనం ఇక ఉండదా అంటూ ఈ కధనాలను ఇస్తున్నారు. సాయిబాబ ఎప్పటికి జనంలో సజీవ ముద్రతోఉండడానికి, ఆశ్రమంలో ఆయన ఆరంభించిన వివిధ ఆధ్యాత్మిక కార్యకలాపాలు యధావిధిగా కొనసాగించడానికిగాను ఈ కార్యక్రమం చేపట్టవచ్చన్న వదంతులను కొందరు లేవదీశారు.కాగా సత్యసాయి ట్రస్టు వారు పుట్టపర్తి నుంచి రెండు ట్రక్కులలో బంగారాన్ని బెంగుళూరుకు రవాణా చేస్తుండగా, దేవనహళ్లి చెక్ పోస్టు వద్ద కస్టమ్స్ అదికారులు ఆపారని, ఆయితే బాబా ట్రస్టువని తెలిసి వదిలేశారని మరో పత్రిక కధనాన్ని ఇచ్చింది. ట్రస్టు సభ్యులు వీటన్నిటిపై ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వకపోతే, అవన్ని వాస్తవాలేననుకునే ప్రమాదం కూడా ఉంది. అయితే ఒకటి కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు బాబా ఆరోగ్యం మెరుగుపడుతోందని చెబుతూ వచ్చిన డాక్టర్లు రెండు రోజులుగా బాబా ఆరోగ్యం విషమిస్తోందని, తమ శాయశక్తులా చికిత్స చేస్తున్నామని చెప్పడం గమనించదగ్గ పరిణామంగా ఉంది.నిజంగానే సాయిబాబాను సజీవ సమాధి చేసే అవకాశం ఉందా? అలాంటి అవకాశం లేకపోతే, ఇలాంటి వదంతులు సృష్టించేవారిని కనిపెట్టి వారిపై చర్యలు తీసుకోవలసిన అవసరం కూడా ఉంది.
- kommineni.info

కామెంట్‌లు

  1. నమ్మకాలు -వాస్తవాలు
    మన దేశంలోనే కాదు. ప్రపంచాదేశాలన్నింటా మతం, నమ్మకాలు, తెచ్చిపెట్టుకున్న విశ్వాసాలు వగైరాల ప్రభావంతో వెలసిన సంస్థలు, ట్రస్టులు,ఆలయాలు మొదలైన ధార్మిక సంస్థలు గా చెప్పుకునేవన్నీ చివరకు (మొదలు లో కూడా) వాటికి సంబంధించి పోగుపడిన కోట్లమంది అమాయక భక్తుల విరాళాలు, నిధుల పరిరక్షణ పేరుతో పెద్ద నాయకులతో, అధికారులతో కుమ్మక్కయ్యి ఆర్ధిక నేరాలకు, హత్యోదంతాలకూ, ఇంకా చెప్పనలవి కాని కుంభకోణాలకు పాల్పడుతున్నవి శతాబ్దాలుగా కళ్ళకు కడుతున్న చరిత్ర. ఆదిశంకరాచార్య, మహమ్మద్ ప్రవక్త, బుద్ధుడు, ఏసుక్రీస్తు,శ్రీరామకృష్ణ పరమహంస, వంటి మహాత్ములు అప్పటి దీనజన విముక్తికోసం, జ్ఞానం పట్ల వారిని జాగృతం చెయ్యడం కోసం కృషి చేస్తే, చుట్టూ చేరిన ప్రజాద్రోహులు, సామ్రాజ్యవాదులు, పాలకులు మహాత్ములకు అండదండగా ఉన్నట్టు నటిస్తూ, మందిరాలు కట్టి, విగ్రహాలు పెట్టి, శిలవేసి ప్రజాబాహుళ్యానికి అందకుండా చేసి, లేనిపోని మహత్తులను, మత్తులను  అంటగట్టి, వారి ఉన్నతాశయాల్ని మూడనమ్మకాలుగా తర్జుమా చేసేసి ప్రజల్ని అసలు జ్ఞానం వైపుకు మళ్లకుండా మూర్ఖంగానే ఉంచి, బానిసత్వాన్ని కొనసాగించే కుట్రలే చరిత్ర మొత్తం కనిపిస్తున్న దాఖలాలు. ఇప్పడు మహాత్ముల పర్వం ముగిసినట్టనిపిస్తోంది. మతం ముసుగులో అవే మూడనమ్మకాల్ని మరింత సాంకేతికత జోడించి వాడుకుంటూ వారే సొంత సామ్రాజ్యాలు నెలకొల్పుకొనే స్థాయికి స్వాములు,అమ్మలు, బాబాలుగా పరిణతి చెందారు. ప్రజలు కూడా తమను తాము తెలుసుకొనే ప్రయత్నం చెయ్యకుండా పూర్తి ఆర్దికపరమయిన అంశంగా లాభాల కోరికలతో కొంతమంది, బాధల అసలు కారణం కనుక్కోలేక వీళ్ళ దగ్గరే పరిష్కారం వెతుక్కునే కొంతమంది అమాయకులు కలిసి జేజేలు కొట్టుకుంటూ కొండనక, ఎండనక వారి వెంటబడడం-- వారేమో దొంగ వేషధారణలతో భక్తులకు మాత్రం వర్తించే నియమాలను పెట్టి, నిండిన బొక్కసంతో ఏ సి మందిరాలలో స్పెషల్ భక్తులకు స్పెషల్ దర్శనం, ప్రయివేటు ఉపదేశాలు సంభాషణలు – ఎందుకిలా???
    ఆశ్రమంలోనే నలుగురి కాల్చివేత(హత్యలు), నిగమాగమ ప్రారంభసరంభంలో జారిన గొలుసుల మహత్తులు వంటి సంఘటనల తరువాత పాపపరిహారంగా చేసిన మంచినీటి వసతి,విద్య,వైద్య సేవలు అందరికీ విదితమే! ఇక్కడ అసలు వైచిత్రి ఏమిటంటే ప్రభుత్వం చెయ్యాల్సిన పనులను ఈ మతసంస్థలు తలకెత్తుకోవడం, మతాతీత గణతంత్ర రాజ్యాంగ రక్షకులేమో ఆశ్రమాలలో పాదాభివందనాలు, పోలీసు రక్షణలు--- ఏమి జరుగుతోందసలు???
    “ మనం ‘ ఏమిటో ‘ ’ఆదాని’ నుంచి పారిపోవడానికి ఉపయోగించుకున్నంత కాలం దేవుడు, తాగుడు స్థాయి ఒక్కటే ”. ఒక మహానుభావుని పలుకు. ఆయనను ఈ రొంపిలోకి దించద్దనుకున్నా సందర్భంగా గుర్తొచ్చి రాసేశాను.
    మళ్ళి అసలు విషయానికి వస్తే, సాక్షాత్తూ భగవాన్ కి వైద్య సేవలందించడానికి తుచ్చ మానవుల అవసరం ఉంటుందా? ప్రభుత్వ, పోలీసు వలయాలు ఎందుకు అక్కడ? మీడియా కధనాలు ఈ రోజు కొత్తగా శోధించినవేమున్నాయి? మనసు తెరిచి చూసుకుంటే అందరికీ అంతా స్పష్టమే. అక్కడ చేరినవాళ్ళు అప్పటికే బలిసి పులిసి ఉన్నవాళ్ళు ఒకరకం. అమాయక భక్తులొక రకం. ఇప్పుడు జరుగుతున్న అసలు వ్యవహారమంతా డబ్బు,ఆస్తులు,ట్రస్టు, బిల్డింగులు,భూమి పుట్రా, నగా నట్రా  వాటిలో వాటాలు, పంపకాలు, తరలింపులు, బుజ్జగింపులు, పందేరాలు --- ఇక చెప్పలేనంత. ఇలాంటి సంస్థల పుట్టుకే ఇదయినప్పుడు, ముగింపు కూడా ఇలాగే ఉంటుంది. ఎటొచ్చీ అమాయక భక్తుల్ని మినహాయిస్తే, అక్కడ చేరిన, చేరుకుంటున్న వాళ్ళంతా ఎంతటివారయినా తుచ్చులే! దొంగలే!
    ఆలోచించవలసింది సామాన్యులు, మేధావులు మాత్రమే! ప్రతీ దానికి అన్నలో, అన్నా హాజరేలో వస్తారని ఎదురు చూడడం అవివేకం బాధ్యతా రాహిత్యం. ఈ అవ్యవస్థల్ని సమూలంగా నాశనం చేసే వ్యక్తులెవరైనా సరే -- అసలంటూ పూనుకుంటే ,భావి తరాలను కాపాడినవారవుతారు.   
    రాజా.   
    gksraja.blogspot.com

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!