సన్నగిల్లిన బాబా శ్వాస

పుట్టపర్తి సాయిబాబా భౌతికంగా చివరి దశకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు అందిన సమాచారం ప్రకారం, బాబా శ్వాస మందగించింది. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. బాబావారి ప్రధాన అవయవాలు ఏవీ పనిచేయడంలేదు. ఏ క్షణంలో గుండెలు పగిలిపోయే వార్త వినాల్సి వస్తుందోనని భక్తులు కలవరపడుతున్నారు.
 కాగా, బాబావారిని, తాను ప్రత్యక్షంగా తాను చూశానని, ఆయన శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని జిల్లా కలెక్టర్ జనార్దనరెడ్డి వెల్లడించారు. పుట్టపర్తిలో తాజా పరిస్థితులను ఆయన సమీక్షించారు.సాయిబాబకు వైద్యం జరుఉగుతున్నప్పటికీ, ఆయా అవయవాలు చికిత్సకు సహకరించడం లేదని ఆయన తెలిపారు. బాబా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున మొట్టమొదటిసారిగా జిల్లా కలెక్టర్ ఈ ప్రకటన చేయడం విశేషం. మంత్రి గీతారెడ్డి అక్కడే ఉన్నప్పటికీ,ఆమె ఇతర వ్యవహారాలలో బిజీగా ఉన్నందున కలెక్టర్ ఈ ప్రకటన చేశారు. కాగా రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖులు వచ్చే విషయం ఇంకా ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు.అయితే మంత్రి రఘువీరారెడ్డి
పుట్టపర్తికి చేరుకోబోతున్నారు. సాయిబాబా విషయంలో ఏమి జరగబోతోందో, ఏమి చేయబోతున్నారో, అలాగే ట్రస్టు కార్యకలాపాలపై ఏమి జరుగుతున్నదో వివరణాత్మకమైన ప్రకటన ఏదీ రాకపోవడం మాత్రం బక్తజనానికి ఆందోళన కలిగిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!