అన్నా దీక్షకి ఫీవ‌ర్ అడ్డమా..?


ప‌టిష్ఠమైన లోక్‌పాల్ బిల్లుకోసం అన్నా హ‌జారే దీక్ష చేయ‌డానికి పూనుకున్నారు. అయితే.. గ‌త కొద్ది రోజులుగా అన్నా ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే.. త‌న అనారోగ్యాన్ని కూడా లెక్కచేయ‌కుండా  అన్నా హజారే మూడు రోజుల దీక్షను మంగళవారం ముంబైలో ప్రారంభించనున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేలవమైన లోక్‌పాల్ బిల్లుకు నిరసనగా హజారే మూడు రోజుల దీక్షను చేపట్టనున్నారు. దీక్ష కోసం సోమవారం రాత్రి రాలేగావ్‌సిద్ధి నుంచి ముంబైకి చేరుకున్నారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షను చేపట్టేందుకే మొగ్గు చూపారు. బాంద్రా సబర్బన్ నుంచి ర్యాలీ నిర్వహించి, ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. జుహూలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి ముందుకు సాగనున్నారు. హజారే ర్యాలీ శాంతాక్రజ్, తులిప్ స్టార్ హోటల్, మితిబాయి కాలేజి, ఎస్‌వీ రోడ్, విలే పర్లే, ఖర్, బంద్రా హైవేలలో నిర్వహించనున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!