అమ్మకానికి ఈటీవీ ఛానెల్స్‌..?


మీడియా మొఘల్ గా ప్రసిద్దిగాంచిన ఈనాడు అధినేత రామోజీరావు తన టీవీ ఛానళ్లను అమ్మకానికి పెట్టినట్లు కధనాలు వస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రికలలో వచ్చిన కధనాలను ఇప్పుడు తెలుగు పత్రికలు కూడా ప్రచురిస్తున్నా యి.నెట్ వర్క్ – 18గ్రూప్ తో ఈటీవి సంస్థలు ఒక అవగాహనకు రావడానికి గాను చర్చలు జరుగుతు న్నాయని, అవి తుది దశలో ఉన్నాయని ఆ కధనాలు వెల్లడిస్తున్నాయి.గత కొంత కాలంగా ఈటీవి చానళ్లను విక్రయించడానికి రామోజీ గ్రూప్ ప్రయత్ని స్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇతర భాషలలోని చానళ్లు నష్టాలలో ఉండడం ఒక కారణంగా , నిర్వహణ సమస్యల రీత్యా కూడా వాటిని వేరే వారికి అప్పగించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.కొంతకాలం క్రితం సోని సంస్థతో డీల్ కుదిరిందని ప్రచారం జరిగింది.కాని అది ఎందువల్లనో అది జరగలేదు.ఇప్పుడు తాజాగా ఒప్పందం కుదిరితే రెండువలే ఆరువందల కోట్ల నుంచి మూడు వేల ఒక్క వంద కోట్ల వరకు విలువ పలకవచ్చని చెబుతున్నారు. మీడియా రంగంలో విశేషమైన కృషి చేసి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న రామోజీ ఇప్పుడు టీవీ చానళ్లను అమ్మకానికి పెట్టడం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!