నిర‌స‌న‌ల మ‌ధ్య బాబు టూర్‌..


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న రెండు కళ్ళ సిద్ధాంతం తెలంగాణ వాదులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోరుబాట యాత్రను మంగళవారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ యాత్రను అడ్డుకుని తీరుతామని తెలంగాణ వాదులతో పాటు తెరాస నేతలు హెచ్చరించారు. ఏది ఏమైనా యాత్ర జరిగి తీరుతుందని తెదేపా శ్రేణులు ప్రకటించాయి.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు యాత్ర మంగళవారం ఉదయం 11 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గం లంబాడిపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెడతారని ఆ పార్టీ మీడియా విభాగం తెలిపింది. సీతారాంపూర్, ములకనూరు, మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామాల మీదుగా నుస్తులాపూర్‌కు యాత్ర చేరుకుంటుందని వివరించింది. సాయంత్రం 5 గంటలకు నుస్తులాపూర్‌లో బహిరంగ సభ జరుగుతుందని తెలిపింది.
ఇదిలావుండగా, తెలంగాణపై వైఖరిని స్పష్టం చేయకుండా రెండు కళ్ల వాదం, తటస్థ సిద్ధాంతమంటూ నాలుక మడతపెట్టే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును ఇక తెలంగాణలో తిరుగనీయకూడదు… జై తెలంగాణ అంటేనే చంద్రబాబును తెలంగాణ జిల్లాలో తిరుగనిస్తామని తెలంగాణ జేఏసీ, తెలంగాణవాదులు విస్పష్టంగా పిలుపునిచ్చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!