వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అత‌నే ‘కిర‌ణం’


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అధిష్టానంలో పట్టు పెరిగిందని ఆయన శిబిరంలోని ముఖ్యులు వ్యాఖ్యా నిస్తున్నారు. గత కొన్ని నెలలుగా కిరణ్ కుమార్ రెడ్డి పని చేస్తున్న తీరుపై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు నమ్మకం కుదురుతోందన్నది వీరి వాదనగా ఉంది. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం అందులో ఒకటి కాగా, ప్రభుత్వాన్ని ఆయన ముందుకు తీసుకు వెళుతున్న తీరు కూడా మరో ముఖ్యమైన అంశమని వారు వివరిస్తున్నారు. ప్రత్యేకించి యువనేత, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమారుడు అయిన రాహుల్ గాంధీ కూడా కిరణ్ పట్ల సంతృప్తి కనబరుస్తున్నారని అంటున్నారు. రాహుల్ ప్రత్యేకించి అన్నారో లేదో కాని ఆయన వద్ద పనిచేసే ఒక ముఖ్యమైన బాధ్యుడు మాత్రం ఒక వ్యాఖ్య చేశారట. రెండువేల పద్నాలుగులో ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిస్తే ఎలాగూ కిరణ్ కుమార్ రెడ్డే నాయకత్వం వహిస్తారు. వివిధ రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ ఓడిపోతే కనుక తిరిగి 2019 ఎన్నికల నాటికి కూడా కాంగ్రెస్ తరపున నాయకత్వ బాధ్యతలు కిరణ్ కుమార్ రెడ్డే వ్యవహరిస్తారని అన్నారట. ఈ విషయం ఉత్తరప్రదేశ్ లో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక తెలుగు ప్రముఖుడితో అనగా, ఆ మాట ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శిబిరం వరకు చేరింది. దానితో సహజంగానే సి.ఎమ్. క్యాంప్ ఆనందం వ్యక్తం చేస్తోంది.అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరని, ఈలోగా ఎన్ని మార్పులు రాకపోవచ్చని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే రాహుల్ గాందీ వద్ద కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి మార్కులు పడితే , రాహుల్ సన్నిహిత టీమ్ లో కిరణ్ కూడా ఒకరిగా ఉంటారని మరి కొందరు భావిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!