కేసీఆర్‌పై ఎర్రబెల్లి ధ్వజం..


తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాత్రి ఒక మాట ఉదయం మరో మాట మాట్లాడతారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం ధ్వజమెత్తారు. టిఆర్ఎస్ నేతలు తెలంగాణ పేరు చెప్పి మంత్రి పదవులు అనుభవించారని విమర్శించారు. సెంటిమెంటు పేరుతో ఆర్థికంగా లాభపడింది టిఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వస్తే తెలంగాణపై తీర్మానం చేయిస్తామన్నారు. ప్రస్తుతం మేం తెలంగాణ తెచ్చే పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితుల్లో లేమన్నారు. కానీ తెస్తామన్న టిఆర్ఎస్, ఇస్తామన్న కాంగ్రెసు మాత్రం కుమ్మక్కయ్యాయన్నారు.
తెలంగాణ పేరుతో తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదన్నారు. టిఆర్ఎస్ తీరును తెలంగాణ ప్రజలు హర్షించరన్నారు. పోలవరం టెండర్లలో కెసిఆర్ పాత్ర ఉందని దానిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలను సెంటిమెంటు పేరుతో మోసం చేస్తున్నారన్నారు. వ్యాపారస్తులు, సీని పరిశ్రమలోని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ జెండాలు, పార్టీ పక్కన పెట్టి వస్తే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి టిడిపి హయాంలోనే జరిగిందన్నారు. టిఆర్ఎస్, కోదండరామ్ రెడ్డి ప్రజల్ని రెచ్చగొట్టవద్దన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!