మ‌నీలాండ‌రింగ్‌తో సాక్షి ఛానెల్‌..?


మనీలాండరింగ్‌కు పాల్పడి అవినీతి సొమ్ము, బ్లాక్ మనీతో సాక్షి ఛానల్ ప్రారంభించారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు మంగళవారం లోకసభలో అన్నారు. సభలో కేబుల్ నెట్ వర్క్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. టీవీ రంగంలోకి అత్యధికంగా మనీలాండరింగ్ డబ్బు వస్తోందని, కేబుల్ నెట్ వర్క్‌లోకి మాఫియా జొరబడిందని, దీన్ని ఎలా నియంత్రిస్తారని అడిగారు. ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ఛానల్‌ను మనీలాండరింగ్ డబ్బుతోనే ఏర్పాటు చేశారని, ఇలాంటి టీవీ ఛానళ్ల నియంత్రణకు సరికొత్త వ్యవస్థ కావాలన్నారు. లేదంటే దీనివల్ల దేశంపై దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. సాక్షి ఛానల్‌ను నిలువరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి సొమ్ముతో ఛానల్ ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పుడు అందరిపైనా అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నారన్నారు. ఈ ఛానల్‌పై మనీ లాండరింగ్ చట్టాల కింద విచారణ కూడా నడుస్తోందని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇలా అవినీతి సొమ్ముతో ఏర్పాటవుతున్న ఛానళ్లను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!