ప్రణీత్ మృతికి యుకె ఎన్నారైల సంతాపం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనయుడు ప్రతీక్‌రెడ్డి మృతి పట్ల యూకేలోని తెలుగు ఎన్నారైలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుమారుడిని కోల్పోయి పుత్రశోకంలో ఉన్న కోమటిరెడ్డికి వారు సానుభూతి తెలిపారు. ఈమేరకు సోషియో-పొలిటికల్ అనాలిసిస్ రీసెర్చ్ సెంటర్(స్పార్క్) ఒక ప్రకటన విడుదల చేసింది.
మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై మంగళవారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో ప్రతీక్‌రెడ్డి సహా ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతీక్‌రెడ్డితో పాటు మృతి చెందిన మరో ఇద్దరి కుటుంబాలకు కూడా స్పార్క్ సానుభూతి తెలిపింది. బ్రిస్టాల్, కేంబ్రిడ్జి, ఎడిన్‌బర్గ్, లండన్ తదితర ప్రాంతాల్లోని ఎన్నారైలు 2008 స్పార్క్‌ను ఏర్పాటు చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!