మూడు ప‌ద‌వులు ఖాయ‌మేనా..?


ప్రజారాజ్యం వర్గం నేతల ఒత్తిడి త్వరలోనే ఫలిస్తుందన్న కధనాలు వస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేల కోటా కింద ముగ్గురికి మంత్రి పదవులు రావచ్చని చెబుతున్నారు. ఈనెల ఇరవై తొమ్మిదిన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.అయితే ఇందులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఇప్పటికే చిరంజీవి వర్గానికి కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతోందన్న ప్రచారం ఊపందుకుంది. అందువల్ల అధిష్టానం కూడా ఒకే చేయవచ్చు. చిరంజీవి మూడు ప్రాంతాలకు చెందిన ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. ఆ ప్రకారం అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, బాల్కొండ ఎమ్మెల్యే అనిల్ కు మంత్రి పదవులు దక్కవచ్చని భావిస్తున్నారు.అయితే ఈలోగా ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోకుండా ఉంటేనే ఇది జరుగుతుందని మనం అనుకోవాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!