పైచేయి సాధించిన కిర‌ణ్‌


పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై చేయి సాధించారని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొన్ని రోజుల క్రిందట కాంగ్రెస్ లో తానే సర్వం అన్న చందంగా బొత్స వ్యవహరించి కాంగ్రెస్ శ్రేణులలో గందరగోళానికి కారకులయ్యారని, అయితే ఆ తర్వాత పరిణామాలలో ఆయన కొంత వెనుకబడి కిరణ్ ది పై చేయి అయిందని కిరణ్ శిబిరం భావిస్తోంది.దానికి రెండు, మూడు కారణాలు ప్రధానంగా చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంలో ప్రజారాజ్యం వర్గం ఎమ్మెల్యేలు కొందరిని బొత్స రెచ్చగొట్టారని, చిరంజీవిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారని, ఆ విషయం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లిందని కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. ఆ మీదట అదిష్టానం బొత్స పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచిందని, ఆ సమాచారం కూడా తమ వద్ద ఉందని వీరు చెబుతున్నారు.పార్టీ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలేమిటని అధిష్టానం ప్రశ్నించిందన్నది వీరి వాదన.అదే తరుణంలో మద్యం సిండికేట్ల వ్యవహారం , ఎసిబి దాడులతో వెలుగులోకి వచ్చిన అంశాలపై బొత్స ఆత్మరక్షణలో పడ్డారని, దీంతో బొత్స కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చిందని కిరణ్ మద్దతుదారులు చెబుతున్నారు.ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, యువనేత రాహుల్ గాంధీకి సైతం బొత్స మద్యం సిండికేట్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందని,కాందరు ఆంధ్ర నేతల వద్ద రాహుల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారని కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.అయితే కిరణ్ కుమార్ రెడ్డి కోరుకున్నట్లు బొత్సను మంత్రి పదవి నుంచి తప్పించి , కేవలం పిసిసి అధ్యక్ష పదవికి పరిమితం చేయాలన్నదానిపై అధిష్టానం ఇంకా సానుకూలంగా స్పందించిందని వీరు గట్టిగా చెప్పలేకపోతున్నారు.అదే సమయంలో బొత్స కూడా వ్యూహాత్మకంగా కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించినా, తెలివైన నాయకుడని, అంత తేలికగా లొంగే తత్వం కాదని వీరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి, పిసిసి అద్యక్షుల మధ్య పెనుగులాట వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!