నాయ‌కులు హ‌ద్దులు మీరుతున్నారు..


తెలంగాణ తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి నేతల మద్య మాటల యుద్దం బాగా ముదిరిపోయింది. టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై గత కొద్ది రోజులుగా టిటిడిపి ఫోరం నేతలు దయాకరరావు, మోత్కుపల్లి నరసింహులు, తదితరులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తు తున్నారు. కెసిఆర్ డబ్బుకోసం తెలంగాణ ఉద్యమాన్ని అమ్మివేశారని, పార్లమెంటును వదలిపెట్టి ఫామ్ హౌస్ లో గడుపుతున్నారని మండిపడ్డారు. దానికి సమాధానంగా టిఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ మరింత తీవ్రంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చనిపోయిన పార్టీ అని , చంద్రబాబు నాయుడు రాజకీయంగా చనిపోయిన నాయకుడు అని వ్యాఖ్యానించారు. సంజీవనితో చనిపోయిన నేతలను లేపాలని తెలంగాణ తెలుగుదేశం నేతలు చూస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని కాంట్రాక్టర్లకు ఊడిగం చేసే పార్టీగా చంద్రబాబు మార్చారని ఆయన ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరవేసుకోవాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల వద్దకు వెళతారని ఈటెల ప్రశ్నించారు. ఏది ఏమైనా మన రాష్ట్రంలో నేతల మాటలు హద్దులు దాటిపోతున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!