బోత్స మాస్టర్ ప్లాన్‌


పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారా యణ మాస్టర్ స్ట్రోక్ కొట్టారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో తనను ముఖ్యమంత్రి ఇరికించి అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్న బొత్స సత్యనారాయణ ఏకంగా నూట అరవై మంది ఎమ్మెల్యేలపై సిబిఐ విచారణ చేయించి ఎవరెవరికి మద్యం వ్యాపారంతో సంబందం ఉందో తేల్చాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసి సంచలనం సృష్టించారు.స్వయంగా ఆయన ఈ లేఖను ముఖ్యమంత్రికి అందచేయడమే కాకుండా పార్టీ హై కమాండ్ కు కూడా ఈ లేఖ ప్రతిని పంపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారు చేసే ఆరోపణలతో మనం ఏమి చేస్తామని ముఖ్యమంత్రి అన్నారని కధనాలు వస్తున్నాయి. అయినప్పట్టికీ సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని బొత్స లేఖను అందచేశారని, ఈ సందర్భంగా వారిద్దరి మద్య కాస్త వాగ్వాదం జరిగిందని కదనాలు వస్తున్నాయి.మధ్యం వ్యాపారం ద్వారా తానొక్కడినే అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు రావడంపై బొత్స ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా ఎవరెవరికి మద్యం వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయో తెలిపే జాబితాను కూడా ముఖ్యమంత్రికి బొత్స సమర్పించారని అంటున్నారు. ఏది ఏమైనా బొత్సను తేలికగా అంచనా వేయరాదని మరోసారి రుజువు అయింది.నిజంగానే బొత్స కోరినట్లు సిబిఐ విచారణకు ఆదేశిస్తే మొత్తం పార్టీ అంతా కష్టాలలో పడే ప్రమాదం ఉంది. అలా చేయని పక్షంలో బొత్స తన డిమాండ్ ను ఎందుకు అంగీకరించలేదని ప్రశ్నించే అవకాశం తెచ్చుకోవడం ద్వారా తాను క్లీన్ అన్న భావాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లగలుగుతారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!