ఇక బంతి స్పీక‌ర్ కోర్టులో..!


విప్ ఉల్లంఘించిన జగన్ వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ప్రత్యక్షంగా సవాల్ విసిరారు. వారి మనసులో ఎలాంటి భావనలు ఉన్నాయో కాని, బహిరంగంగా మాత్రం తమపై అనర్హత వేటు వేసి అసెంబ్లీ స్థానాలను ఖాళీ అయినట్లు ప్రకటించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు జగన్ తో భేటీ అనంతరం విప్ ఉల్లంఘనను స్వయంగా స్పీకరే చూశారు కనుక నేరుగా వేటు వేయవచ్చని స్పష్టం చేశారు.దీంతో జగన్ వర్గం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అటో, ఇటో తేల్చుకోవాలని భావిస్తున్నదని భావించాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని ఉప ఎన్నికలకు సిద్దంగా లేదని తలస్తున్న వీరు దానిని ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఆ క్రమంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా కాంగ్రెస్ కుట్రలో భాగస్వామి కారాదని అనడం విశేషం. అందరిపై ఒకేసారి అనర్హత వేటు వేయాలని వారు డిమాండ్ చేయడం సబబుగానే ఉంది.మరి స్పీకర్ ఏమి చేస్తారోచూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!