ప‌ల్లెబాట నుండి విదేశాల‌కు


టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజులపాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 23వ తేదీ రాత్రి విదేశాలకు వెళ్లే చంద్రబాబు తిరిగి 26వ తేదీ రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. అయితే ఆయన ఎక్కడికి వెళుతున్నారన్న విషయాన్ని రహస్యంగా ఉంచారు. చంద్రబాబు పర్యటన వివరాలను గతంలో కూడా బహిర్గతం చేయలేదు. ఈసారి ఆయన దుబాయ్ లేదా సింగపూర్ వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత 27న కరీంనగర్ జిల్లాలో జరిగే రైతుపోరుబాటలో చంద్రబాబు పాల్గొంటారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పోరుబాట నిర్వహిస్తారు. టీఆర్‌ఎస్ శ్రేణుల హెచ్చరికల నేపథ్యంలో 28న వరంగల్‌లో జరపతలపెట్టిన పోరుబాటను బాబు వాయిదా వేసుకున్నట్లు సమాచారం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!