సిఎం ఢిల్లీ టూర్ వెనుక‌..


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హటాత్తుగా డిల్లీ వెళుతుండడంతో రాజకీయ వర్గాలలో మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఇంతవరకు వారికి ఇస్తామన్న మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై ఆ వర్గం గుర్రుగా ఉంది. అలాగే మంత్రివర్గంలో డాక్టర్ శంకరరావు, డి.ఎల్.రవీంద్ర రెడ్డి వంటి కొద్ది మందితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సరిపడడం లేదు.శంకరరావు అయితే మరీ రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారన్న అబిప్రాయం ఉంది. ఇదంతా కాంగ్రెస్ కు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట కలుగుతున్నదన్న వాదన కూడా ఉంది.అలాగే పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ ను మంత్రి పదవి నుంచి తప్పించాలని కూడా ముఖ్యమంత్రి కోరుతున్నారు.ఈ నేపధ్యంలో పార్టీ అధిష్టానంతో మంత్రివర్గంలో మార్పులు,చేర్పుల గురించి చర్చించవచ్చని భావిస్తున్నారు.అయితే తెలంగాణ అంశం పరిష్కారం కాకుండా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా అన్న సందేహం ఉంది. అలా కాని పక్షంలో మంత్రివర్గ విస్తరణ కేవలం చిరంజీవి వర్గానికి పరిమితం కావచ్చని అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!