టిఆర్ ఎస్‌ని టార్గెట్ చేసిన టిడిపి


తెలుగుదేశం తెలంగాణ ఫోరం, టిఆర్ఎస్ ల మధ్య ఉరితాళ్ల వ్యవహారం ప్రహసంగా మారింది. తెలంగాణలో ఆధిపత్య పోరులో భాగంగా తెలుగుదేశం పార్టీ గత కొద్ది రోజులుగా టిఆర్ఎస్ పై ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావుపై విరుచుకుపడుతోంది.సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకరరావులు ఉరితాడు తీసుకుని గన్ పార్కువద్దకు వెళ్లి కెసిఆర్ కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ఏడువందల మందిని బలి తీసుకున్నారని, ఆయన మాత్రం కాంగ్రెస్ వారి నుంచి పోలవరం టెండర్ తీసుకుని ఉద్యమాన్ని విరమించుకున్నారని నరసింహులు ఆరోపించారు. దీనిపై టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. మోత్కుపల్లి నరసింహులు రేసు కుక్కలా కాకుండా సంస్కారయుతంగా వ్యవహరించాలని అన్నారు.చంద్రబాబు వద్ద పాలేరు మాదిరి నరసింహులు ప్రవర్తిస్తున్నారని ద్వజమెత్తారు. కెసిఆర్ మౌనంగా లేరని తెలంగాణ సాధనకోసం కార్యాచరణ తయారు చేస్తున్నారని అన్నారు. కెసిఆర్ గోడ మీద తుపాకి అనడాన్ని సమర్ధించుకుంటూ తుపాకి తీస్తే ఏమవుతుందో బిడ్డా తెలుసుకో అని చంద్రశేఖర్ హెచ్చరించారు. శుక్రవారం నాడు తెలంగాణ కోసం ఉరి వేసుకోవడానికి సిద్దమని, కెసిఆర్ కూడా అందుకు రావాలని నరసింహులు సవాలు విసిరారు. అదే మాదిరి శనివారంనాడు రెండు తాళ్లు తీసుకుని గన్ పార్కు వద్దకు వెళ్లడం, పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!