కంగారూల చేతిలో కుదేల‌య్యారు..


భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలిటెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 122 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇండియా 169 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా స్కోర్లు – 333, 240 కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 282 గా ఉంది. విదేశాల్లో భారతికి వరుసగా ఐదో ఓటమి. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకే పెవిలియన్ దారి పట్టగా, టెండుల్కర్ 32, అశ్విన్ 30 పరుగులు చేయగలిగారు. టెస్ట్‌లో మొత్తం ఆరు వికెట్లు తీసిన ఆసిస్ బౌలర్ ప్యాటిన్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. బ్యాటింగ్‌లో వైఫల్యం వల్లే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిపోయామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేర్కొన్నాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ తమ బ్యాటింగ్ ఘోరంగా ఉందని మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. మొదటి టెస్ట్‌లో ఆసీస్ చేతిలో 122 పరుగుల తేడాతో ఓడిపోవడం పట్ల ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!