ప్రతిప‌క్షనేత‌గా బాబు ఫెయిల్‌


ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయు డు విఫలమయ్యారని బీజేపీ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు విమర్శించారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు పేరిట వరంగల్ జిల్లా పరకాలలోని అమరథామం చిత్ర పటంతో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభ మంగళవారమిక్కడ జరిగింది. అవకతవకలు జరిగాయంటూ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా జలయజ్ఞంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఆరేళ్ల కిందట చర్చ జరిగినప్పుడు చంద్రబాబు సక్రమంగా వ్యవహరించి ఉంటే ప్రభుత్వం తన తప్పుల్ని సరిదిద్దుకుని ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై లోకాయుక్త నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నృపేంద్రరావ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నేతలు ప్రభాకర్, సత్యనారాయణరావు, గాయకుడు అంద్శైపాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!