ఉపఎన్నిక‌లు రెఫ‌రెండం కాద‌ట‌..!


కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటోంది. గెలవడానికి అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఒక కొత్త వాదనను చేపట్టింది.తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారి నియోజకవర్గాలతోపాటు, జగన్ వర్గం పై వేటు పడితే జరిగే సుమారు పాతిక నియోజకవర్గాలలో జరిగే ఉప ఎన్నికలు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి రిఫరెండమ్ కాదని ప్రచారం చేయడం ఆరంభించారు.ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదే కాలం అయిందని, అందువల్ల ఆయన పదవి ఆధారంగా ఎన్నికలు జరగడం లేదని, రెండు వేల పద్నాలుగు ఎన్నికలే తమకు గీటు రాయి అని, అప్పటికి ఎలాగూ గెలుస్తామని, కనుక ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలు రిఫరెండమ్ కాదని గాత్రం ఆరంభించారు.గెలవలేకే ఇలా అంటారని విమర్శలు సంగతి ఎలా ఉన్నా ముందుగానే జనం మైండ్ సైట్ ను మార్చడానికి ఇప్పటినుంచే కృషి ఆరంభించారని అనుకోవాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!