కంట‌త‌డి పెట్టిన స‌బిత‌


రాష్ట్ర చేనేత శాఖ మంత్రి డాక్టర్ పి.శంకరరావు తనపై చేస్తున్న ఆరోపణలతో మహిళా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా నొచ్చుకుంటున్నారు.శంకరరావు ఒక సందర్భంలో సబితా ఇంద్రారెడ్డిని లేడీ డాన్ అనడం ఆమెను మరీ కలచివేసిందని అంటున్నారు. తనను కలిసిన కాంగ్రెస్ నేతలు, శాసనమండలి సభ్యుల వద్ద ఈ విషయాలను ప్రస్తావించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అర్ధం, పర్ధం లేని ఆరోపణలు చేస్తూ, సబిత ఇంద్రారెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే ఆలోచనతో ఇది సాగుతోందని, దీని వెనుక రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ వర్గ రాజకీయాలు కూడా ఉండవచ్చని ఆమె సన్నిహితులు అనుమానిస్తున్నారు. కాగా సబితా ఇంద్రారెడ్డి తనను కలిసన మహిళా కాంగ్రెస్ నేతల వద్ద ఈ విషయాలను ప్రస్తావించి కంట తడిపెట్టారని కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. శంకరరావు గత కొంతకాలంగా సబితా ఇంద్రారెడ్డిని లక్ష్యంగా చేసిన ఆరోపణలు గుప్పించడమే కాకుండా, గవర్నర్ నరసింహన్ ను కూడా కలిసి ఆమెకు వ్యతిరేకంగా, అలాగే మరికొందరు మంత్రులకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వినతిపత్రం ఇచ్చి వచ్చారు. అక్కడితో ఆగకుండా నిత్యం విమర్శలు కురిపిస్తున్నారు. నగర శివారులో తనపై జరిగిన దాడి వెనుక కూడా సబిత మద్దతుదారుల ప్రమేయం ఉందని ఆయన అభియోగం మోపుతున్నారు.ఇది కాకుండా మళ్లీ ప్రత్యేక ర్యాలీ చేపడుతున్నారు.ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికాని, అధిష్టానం కాని ఆయన జోలికి వెళ్లడం లేదు. వీటన్నిటి గురించి ఆమె కాంగ్రెస్ నాయకుల వద్ద చెబుతూ కంటతడి పెట్టారని అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!