బాబుపై బొత్స విసుర్లు


తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు తంటాలు పడి తన పై కేసులో కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారని పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్ల న్యాయస్థానాలపై కూడా అనుమానాలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడుపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించిన మొదటి రోజు నుంచి కొన్నాళ్లపాటు తాము దానిపై కోర్టుకు వెళ్లబోమని, విచారణను ఎదుర్కుంటామని చంద్రబాబుతో సహా టిడిపి నేతలు చెబుతూ వచ్చారని, చివరికి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని అన్నారు.చంద్రబాబు నాయుడు దోషి అని అనలేనుకాని, నిర్దోషి మాత్రం కాదని బొత్స వ్యాఖ్యానించారు.ఓక్స్ వాగన్ కేసులో తాను సిబిఐ కేసును ఎదుర్కున్నానని, అందులో తన తప్పేమి లేదని సిబిఐ నిగ్గు తేల్చిందని ఆయన చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!