జ‌ర్నలిస్టుల నిర‌స‌న‌లు..


హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాన్ని కొందరు జర్నలిస్టులు అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంత సరైన చర్య అనిపించుకోదు. సమావేశంలో టిఆర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేయడంపై వీరు నిరసన వ్యక్తం చేశారని చెబుతున్నారు. జర్నలిస్టులు ఎవరైనా గొడవ చేస్తుంటే వాటిని కవర్ చేయడం జరుగుతుంటుంది. కాని అందుకు భిన్నంగా వారే నిరసన తెలపడం జర్నలిజంలో కొత్తపోకడగా బావించాలి. మన దేశంలో భావస్వేచ్చ ఉందని,పత్రికా స్వేఛ్చ ఉందని , దానివల్లనే వారు ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నారని మర్చిపోయి , వారే ఎదుటివారి స్వేచ్చకు ఆటంకం కలిగించడం, ఒక రాజకీయ పార్టీ నాయకుడికి అనుకూలంగా బహిరంగంగా వ్యవహరించడం సరైన పద్దతి అనిపించుకోదు.ఒక వేళ సమావేశంలో మాట్లాడినవారి అబిప్రాయాలతో ఏకీభవించకపోతే అక్కడ నుంచి వెళ్లిపోవచ్చు. తమ పత్రికలలోనో, టీవీలలోనో తమకు నచ్చిన రీతిలో వార్తలు ఇచ్చుకోవచ్చు. అలాకాకుండా జర్నలిస్టులే ఇలాంటి చర్యలు దిగడంలో ఆంతర్యం ఏమిటో అర్దం కాదు.ఎదుటివారు వాదించడానికి చెప్పడానికి అవకాశం ఇవ్వడానికి ఇష్టం పడడం లేదంటే వారు తమ వాదన బలహీనమైదని భావిస్తున్నట్లుగా అనుకునే అవకాశం ఉంటుంది.మారుతున్న కాలానికి మారిన పద్దతులు ఇవి కాబోలు అని సరిపెట్టుకోవాలా?కాగా సమావేశం జరుగుతున్న హాలు ముట్టడించడానికి కొందరు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!