రణభేరికి ముందే రగడ రగడ

కరీంనగర్ లో బుధవారం టీడీపీ తలపెట్టిన తెలంగాణ రణభేరి సభ  కు అడుగడుగునా ఆటంకాలు ఎదురైనాయి. తెలంగాణ  వాదులు  టీడీపీ బ్యానర్లను ,ఫ్లెక్సి లను చించి వేసారు, నిరసన ను వ్యక్తం చేసారు.దీంతో  ముందు జాగ్రత్త గా కొందరు నేతలను అదుపు లోకి తీసుకొన్నారు .ఈ పరిణామం తెలంగాణ వాదులను మరింత రెచ్చ గొట్టింది. నాగం జనార్ధన్ రెడ్డి నిర్వహించిన  తెలంగాణ నగారా కు పోటీగా ఎర్రబెల్లి సారధ్యం లో  ఈ రణభేరి జరగనుంది .కాగా మధ్యాన్నం కరీంనగర్ లోని తెలుగు దేశం కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు .ఆ సమయం లో పార్టీ నేతలు సభ వేదిక వద్ద పనుల్లో నిమగ్నమైనారు .ఫర్నిచర్ ,ఇతర వస్తువులు దగ్దమైనట్టు సమాచారం. ఇదంతా టీ ఆర్ ఎస్ కార్యకర్తల పనే అని టీడీపీ నేతలు అంటున్నారు .ఆ తర్వాత వేదిక వద్ద కు వెళ్ళేప్రధాన ద్వారం దగ్గర తెలంగాణ వాదులు భైటాయించారు .కాగా కరీంనగర్ లోకి ప్రవేశించిన  టీడీపీ నేతల కాన్వాయ్ పై కోడి గుడ్లు విసిరారు. ఈ సందర్భం గా పోలీసులు లాటీ చార్జ్ చేసారు .అంతకు ముందు మెదక్ వద్ద కూడా  మాజీ మంత్రులు  దేవేందర్ గౌడ్, బాబు మోహన్  వాహనాలపై రాళ్ళూ రువ్వినట్టు సమాచారం. అక్కడ కూడా పోలీసులు లాటీలకు  పని చెప్పారు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!