మరీ ఇంత మూఢ భక్తా ??


ఎవరో సామాన్యులు ,చదువుకొని వారు ఎలా మాట్లాడినా ఏం చేసినాఅంత పట్టించుకోరు కానే సాక్ష్యాత్తు మంత్రివర్యులే  “సీఎం ని దేవత అంటూ ఆమె వున్నచోట చెప్పులు వేసుకొను” అనడం చిత్రం గా వుంది కదూ.ఈ చిత్రం తమిళనాడు లో జరిగింది.తమిళనాడు సమాచార శాఖ మంత్రి ఉదయకుమార్ ఆ భక్తుడు, దేవత ఎవరో చెప్పనక్కర్లేదు అనుకుంటా. అమ్మ జయలలిత  దేవత ,ఆమె ఉన్న చోటు తనకు దేవాలయమని అక్కడ పాద రక్షలు ధరించనని స్వయం గా  చెప్పి అమాత్యులు వారే  “స్వామిని “భక్తీ ని చాటుకున్నారట.సోమవారం ఆయన పాద రక్షలు లేకుండానే ప్రమాణ స్వీకారం కూడా చేసారట .అంత వరకూ బాగానే వుంది. కానీ మంత్రి గారి తీరు నచ్చి,భక్తికి మెచ్చి అందరిని  అదే బాట లో నడవాలంటూ “అమ్మ” ఆదేశిస్తే ?? మంత్రులు ,ఎమ్మెల్యేలు , అధికారులు  అనుచరులు, నియోజక వర్గ ప్రజలు ఇక పాద రక్షలను  మానేయాల్సిందే.  అదే జరిగితే ఇంకేముంది చెప్పుల కంపెనీ లన్ని  మూత పడటం ఖాయం .
KNM

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!