సీఎం గుండు ఎందుకు చేసుకున్నారు?


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి నమ్మకాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ఆయన ఆదివారం రాత్రి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో తలనీలాలు సమర్పించు కున్నారు. ఆయన వెంట్రుకలు లేకుండా గుండుతో కన్పిం చేసరికి అందరూ ఆసక్తిగా గమనించారు. ఈ మధ్య కాలంలో ఎప్పూడూ కిరణ్ ఈ విధంగా గుండుతో కన్పించలేదు. చిత్తూరు జిల్లా పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చే ముందు ఆయన తిరుమలను సందర్శించారు. ముఖ్యమంత్రిగా రాజకీ యంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ధోరణిలో ఇటీవల కాలంలో అనేక మార్పులు వస్తున్నాయని ఆయనకు సన్నిహితం ఉండే అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో కన్నా ఇప్పుడు సానుకూల అంశాలు పెరుగుతు న్నాయని, అందరూ చెప్పే విషయాలను వినడానికి ఆసక్తి చూపుతున్నారని, తిరుమలలో తలనీలాలు సమర్పిం చుకున్న తర్వాత ఇంకా మారవచ్చునని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఎంత మారతారో ఏమో గానీ ఓ వైపు పార్టీ, మరో వైపు జగన్, ఇంకో తెలంగాణ అంశం ఆయనకు సతమతం చేస్తున్నాయి. తాజాగా నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి ఆయనపై ఫిర్యాదు చేయడం కాస్త సంచలనంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయసమస్యలను, ప్రభుత్వ సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని ఆ భగవంతుణ్ని కోరుకుని ఉంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!