మరో కుటుంబంలో జగన్‌ చిచ్చు

కేవలం తనకుటుంబంలో సోనియా చిచ్చుపెట్టిందని ప్రత్యేకపార్టీనే పెట్టిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అనేక కుటుంబాల్లో చిచ్చురేపేలా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేల సోదరులు,కుటుంబసభ్యులు జగన్ పార్టీలో చేరిపోవడంతో కుటుంబం,బంధువర్గాల్లో ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ కోవలో ధర్మానప్రసాదరావు,రఘువీరారెడ్డి,నన్నపనేనిరాజకుమారి (అల్లుడు జగన్ పార్టీ)తదితరులున్నారు. అయితే తాజాగా గుంటూరుకు చెందిన మంత్రి కాసుకృష్ణారెడ్డి కుమారుడు మహేష్‌రెడ్డి జగన్ పార్టీలోకి వెళ్లిన నేపథ్యంలో ఆ కుటుంబంలో కూడా చిచ్చు రేగింది. తనయుడ్ని విడిచి ఉండలేనని కృష్ణారెడ్డి చెప్తున్న నేపథ్యంలో వారి కుటుంబసభ్యులంతా కృష్ణారెడ్డిని మంత్రి పదవికి రాజీనామా చేసి , వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఇవాళ కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇదే కానీ నిజమైతే మరో మంత్రి జగన్ నీడలో చేరిపోయినట్లే. మరి జగన్‌వైపు మంత్రిగారు వెళ్తారా లేదా తనకే ఎసరు పెట్టిన జగన్‌పై ప్రతీకారం తీర్చుకుంటారా అన్నది కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!