సీతయ్యకి కోపమొచ్చింది..
నందమూరి హరికృష్ణ.. ముద్దుగా ఆయనని సీతయ్య అని పిలుస్తారు. ఆయన సీతయ్య చిత్రంలో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించి మెప్పించారు. అందులో ఆయన ఒక డైలాగ్ చెబుతాడు.. సీతయ్య ఎవ్వరిమాటా వినడు అనే డైలాగ్ వుంది.. అప్పటి ఉండి ఆయన్ని నిక్నేమ్ సీతయ్య అయిపోయింది.. ఇప్పుడిదంతా చెప్పిందెందుకంటే.. ఈరోజు మహానాడు సభలో ఆయనకి కోపమొచ్చింది.. తనని, తన కుమారుడిని మహానాడులో ప్రాధాన్యం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు తనని, తన కుమారుడు లోకేష్ని మాత్రమే హైలెట్ చేస్తూండడంతో హరికృష్ణ సహించలేకపోయారు. ఇక హరికృష్ణ తమ్ముడు, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ షూటింగ్ ఎగ్గొట్టి మరీ మహానాడు సభకి వచ్చాడు. ఆ సందర్భంలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడులు వేదికపై కూర్చొని ఉండగా హరికృష్ణని కూడా అక్కడికి ఆహ్వానించారు. దాంతో ఆయనకి కోపం వచ్చింది.. టిడిపి పార్టీ నేత యనమల రామకృష్ణుడుతో ఏవో ఘాటుగానూ, ఆగ్రహంగానూ చంద్రబాబు వైపు చూపిస్తూ మాట్లాడిన సీతయ్య.. ఇక అక్కడ ఉండకుండా వెంటనే బయటికి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకూ నారా, నందమూరి వారి వారసత్వ పోరు తెరచాటునే ఉండేది.. ఇప్పుడు సీతయ్య.. అదే హరికృష్ణ అందరిముందు తన ఆగ్రహాన్ని ప్రదర్శించడంతో కథ క్లైమాక్స్కి వచ్చినట్టయింది..
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి