సుష్మకు అవమానం



బీజేపీ జాతీయ నాయకురాలు.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన సుష్మాస్వరాజ్‌కు.. రాష్ట్రంలో అవమానం జరిగింది. కరీంనగర్‌ ర్యాలీ కోసం హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకు న్నప్పుడు.. సుష్మాస్వరాజ్‌కు ప్రభుత్వ పరంగా అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. జాతీయ స్థాయిలో కేబినేట్‌ స్థాయి హోదా కలిగిన నాయకురాలైనా.. ప్రభుత్వం ఇందుకు తగ్గట్టుగా ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదు. ప్రోటోకాల్‌ పరంగా ఆమెను పేయింగ్‌ గెస్ట్‌గా మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు ప్రోటోకాల్‌ వెహికిల్‌ కావాలంటే.. కిలోమీటర్‌కు వెయ్యి రూపాయలు చెల్లించాలని సూచించింది. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. తన వాహనంలోనే ఆమెను లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌కు తీసుకెళ్లారు. అనుకోని ఈ సంఘటనతో సుష్మతో పాటు ఇటు పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమైంది.

- తూర్లపాటి నాగభూషణరావు
98852 92208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!