ర‌జ‌నీ ఆరోగ్యం గురించి అమితాబ్ వాక‌బు..


సూప‌ర్‌స్టార్ ర‌జినీ కాంత్ గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో హాస్పిట‌ల్ పాలు కావ‌డం తెలిసిందే.. రాణా చిత్రం ప్రారంభోత్స‌వం రోజు నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ ర‌జ‌నీ ఆరోగ్యం ఇంకా కోలుకోలేదు. తాజాగా ఆయ‌న మెరుగైన వైద్య‌సేవ‌ల‌కు గాను సింగ‌పూర్‌కి వెళ్ళారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. అయితే ర‌జ‌నీ ఆరోగ్యం గురించి ర‌క‌ర‌కాల పుకార్లు షికార్లు చేయ‌డంతో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ కంగారుప‌డిపోయాడ‌ట. ర‌జ‌నీకాంత్‌, అబితాబ్‌లు మంచి స్నేహితులు, వారిద్ద‌రూ క‌లిసి హ‌మ్‌, అందా ఖానూన్ త‌దిత‌ర చిత్రాల‌లో న‌టించారు. అప్ప‌టి నుండి వీరిద్ద‌రూ మంచి మిత్రుల‌య్యారు. అమితాబ్ చెన్నై వ‌స్తే త‌ప్ప‌కుండా ర‌జ‌నీకాంత్ ఇంటికి వెళ్ళి ప‌ల‌క‌రిస్తారు. ర‌జ‌నీ కుటుంబ స‌భ్యుల‌తోనూ అబితాబ్‌కి మంచి అనుబంధం ఉంది. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీ ఆరోగ్యం గురించి అమితాబ్ ర‌జ‌నీ భార్య ల‌త‌కి ఫోన్ చేసి వాక‌బు చేసి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకున్నారు. అంతేకాదు మెరుగైన వైద్యంకోసం సింగ‌పూర్‌లోని మౌంట్ ఎలిజ‌బెత్ హాస్పిట‌ల్‌కి వెళ్ళ‌మ‌ని ర‌జ‌నీకి అమితాబే స‌ల‌హా ఇచ్చారంట‌.. మొత్తానికి త‌న మిత్రుడు ర‌జ‌నీకాంత్ ఆరోగ్యం గురించి వాక‌బు చేయ‌డ‌మే కాకుండా త‌గిన స‌ల‌హాలు కూడా ఇచ్చిన అమితాబ్ ఈజ్ గ్రేట్ క‌దా..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!