సాక్షి నుంచి రామ్ కి ఉద్వాస‌న‌..

సాక్షి మీడియాలో ఒక ప్రధాన మార్పు జరిగింది. సాక్షి సీఈఓగా , సాక్షి పత్రిక ఫ్యామిలీ పేజీ ఎడిటర్‌గా,యాంకర్‌గా అందరికీ సుపరిచితుడైన రామిరెడ్డి ఆలియాస్ ప్రియదర్శిని రామ్‌కు సాక్షి యాజమాన్యం ఉద్వాసన పలికింది. గత కొంతకాలంగా రామ్‌పై రకరకాల కథనాలు వస్తున్నాయి.ఒక దశలో రామ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారబాధ్యతలు స్వీకరిస్తారని కూడా చెప్పేవారు. అయితే ఏం జరిగిందో గాని రామ్ సాక్షి నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో వైఎస్‌జగన్‌తో ఆయనకు సంబంధాలు తెగిపోయినట్లే. మీడియా వర్గాల్లో వస్తున్న కథనాలు ప్రకారం రామ్‌ ఏకపక్ష పోకడ వల్ల టివికి, యాజమాన్యానికి కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చాయని చెప్తున్నారు.సోనియాగాంధీకి వ్యతిరేకంగా ఓ కథనాన్ని ప్రసారం చేసిన తీరు అప్పట్లో వివాదస్పదం అయింది. అలాగే ఉండవల్లి-ఊసరవెల్లి అనే కథనం కూడా యాజమాన్యానికి తెలియకుండా ప్రసారం చేశారని, దీంతో యాజమాన్యం అసంతృప్తి చెంది రామ్‌ను తప్పించాలని నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతుంది. సాక్షి నుంచి బయటకు వచ్చిన రామ్‌ మరో టీవీలో చేరతారా? లేక సొంతంగా ఏదైనా చేస్తారా ? అన్నది చెప్పలేం..ఎనీ హౌ ఆల్‌ ది బెస్ట్ టూ రామ్‌..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!