హై క‌మాండ్‌కి అస‌లు ప‌రీక్ష‌

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఎ.ఐ.సి.సి అధినేత్రి సోనియాగాందీతో కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి గులాం నబీ అజాద్ తో భేటి అయ్యారు. దీంతో రకరకాల ఊహాగానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. పిసిసి అధ్యక్షుడు, స్పీకర్,ఉప ముఖ్యమంత్రి పదవుల భర్తీకి సంబందించి నాయకత్వం ఒక అభిప్రాయానికి వచ్చిందని భావిస్తున్నారు.అలాగే ప్రజారాజ్యం పార్టీ విలీనం ప్రక్రియను పూర్తి చేసే విషయమై కూడా మాట్లాడుకున్నారు. కాగా ఇదే అంశంపై గులాం నబీ అజాద్ , అహ్మద్ పటేల్ లతో చర్చించడానికిగాను
ప్రజా రాజ్యం నాయకులు సి.రామచంద్రయ్య, గంటాశ్రీనివాసరావులు ఢిల్తీ వెళ్లారు. మరో వైపు ఆయా పదవులకోసం కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ పెంచారు. మంత్రి కన్నాలక్ష్మీనారాయణ తాను పిసిసి రేసులో ఉన్నానని, ప్రకటించగా, గుంటూరు ఎమ్.పి రాయపాటి సాంబశివరావు ఆయనను వ్యతరేకిస్తూ ప్రచారం ఆరంభించారు.తెలంగాణ నేతను ఎవరిపైనా పిసిసి అద్యక్షుడిని చేయాలని ఆయన కోరారు. వి.హనుమంతరావు అయితే బాగుంటుందని కూడా ఆయన సలహా ఇచ్చారు. కాగా సోనియాగాంధీ సిమ్లా పర్యటనకు వెళుతున్నారు. ఆమె తిరిగి వచ్చాక తుది నిర్ణయం తీసుకోవాలని గులాం నబీ అజాద్ తో జరిగిన సమావేశంలో నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ వ్యవహారాలను సత్వరమే ఒక కొలిక్కి తీసుకురావాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు అర్దం చేసుకోవచ్చని చెబుతున్నారు.హైకమాండ్ పార్టీ వ్యవహారాలపైనే సీరియస్ గా ఉందా? లేక తెలంగాణ అంశాన్ని కూడా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఉందా అన్నదానిపై ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!